పండిత రమాబాయి సేవాజీవితము

పూర్తి పేరు:- పండిత రమాబాయి సరస్వతి
జన్మస్థలం:- భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం (మంగళూరు దగ్గర).
తల్లిదండ్రులు:- అనంత శాస్త్రి, లక్ష్మీబాయి
భర్త పేరు:- చిచెన్ బిహారీ
జననం:- 1858-ఏప్రిల్-23
మరణం:- 1922-ఏప్రిల్-5
రక్షణానుభవం:- 30 సంవత్సరాల వయసులో

సేవాఫలితము:- విధవరాళ్లకు, దగాపడిన స్త్రీలకు ”శారదాసదన్” ను స్థాపించింది. అంధులకు, అనాధలకు, విధవరాళ్లకు, పతనమైన స్త్రీలకు సువార్త బోధించి ”ముక్తి మిషన్” ను స్థాపించింది. బైబిల్ ను మరాఠీ భాషలలోకి తర్జుమా చేసెను…

గొప్పపలుకు:- “ప్రభువే నా ఆదరణ, సహాయ కర్త మరియు ప్రార్ధన, వాక్య ధ్యానము నా విధి అనెను”…

సేవలో ఎదుర్కున్న కష్టాలు:-

12 సంవత్సరాల వయస్సులోనే తనకు అత్యంత ప్రియమైన ఐదుగురు వ్యక్తులను పోగొట్టుకుంది. కరువులో తల్లి, తండ్రి, సహోదరుడు మరణించారు.. వివాహమైన 19 మాసాల్లోనే కలరాకు గురై భర్త మరణించాడు, కన్న కుమార్తె కూడా మరణించింది. భారతదేశపు స్త్రీల అభ్యున్నతి కొరకు ఏదో చేయాలనే పట్టుదలతో కొన్ని విద్యార్హతలను, శిక్షణను పొందాలనే ఆశతో ఇంగ్లాండ్ వెళ్ళింది. అక్కడ ”చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్” సహోదరీల ద్వారా క్రీస్తు ప్రేమ అనగా ఎట్టిదో చవి చూచి భారతదేశపు స్త్రీల దీనవస్థను క్రీస్తు ప్రభువే మార్చగలరని నమ్మి యేసు అడుగుజాడలలో నడవాలని నిశ్చయించుకుని బాప్తిస్మము పొందెను. ఈమె ”జార్జ్ ముల్లర్” స్థాపించిన అనాధ ఆశ్రమాలను, దేవునిపై విశ్వాసముతో చేయుచున్న ఆయన సేవలు చూచి శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అను మాటయందు విశ్వాసముంచి 1889లో విధవరాండ్రకు, జీవితములో కాలుజారి దగాపడిన స్త్రీల కొరకు *”శారదా సదన్” స్థాపించెను.

పూణే దగ్గరలో ఉన్న “కెడ్ గామ్” అను ప్రాంతంలో అంధులకు, అనాధలకు, విధవరాండ్రకు, పతనమైన స్త్రీలకు సువార్త బోధిస్తూ, విద్య నేర్పించి వారికి ఒక ఉపాధి కల్పిస్తూ “ముక్తి మిషన్” ను స్థాపించింది. హిందూ దేవాలయంలో దేవదాసీలుగా మగ్గిపోతున్న వారిని విడిపించి, చేరదీసి ఆదరించేది. అట్టివారికి చేతిపనులు నేర్పి వారికి వారే పోషించుకునేటట్లు చేసేది. విరామము లేకుండా ఆయా సభలలో వాక్యోపదేశం చేస్తూ రాత్రింబవళ్ళు ఆత్మల సంపాదనకు ప్రయాసపడుతూ ప్రభువు కొరకు ఎంత చేసినా చాలదు అంటూ ఉండేది. ఆమెకు కొన్ని వస్త్రములు, బైబిలు తప్ప మరేమియు లేవు. ఈమె చేసిన గొప్ప పని బైబిల్ గ్రంధము మరాఠీ భాషలలోకి తర్జుమా చేయటం. దానికి దాదాపు తన జీవితకాలమంతయు ఖర్చు పెట్టింది. అందుకోసం హెబ్రీ, గ్రీకు భాషలను నేర్చుకొనెను. ఈమె శక్తి సామర్ధ్యములకు రహస్యము వాక్యధ్యానం, ప్రార్థనలే.. ఈమె కల్వరి ప్రేమతో నిండి ఉండేది. ఈమె ఆశ్రమంలో 300 మందిని పోషించు భారము 1500 మందికి పెరిగెను. రమాబాయి విశ్వాస విషయంలో పలు విధాలుగా పరీక్షించబడేను.. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించి విశ్వాసముతో జయించెను..

(యాకోబు 1:27) తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
క్రైస్తవ విశ్వాసిగా దేవుని సేవించడం అంటే దిక్కులేని వారిని విధవరాండ్రను, అనాధలైన వారిని, నిస్సహాయస్థితిలో ఉన్నవారిని ఆదరించుటయు, పరామర్శించుటయు నిజమైన భక్తికి సూచనగా ఉన్నాయి. అయితే ప్రస్తుత దినాలలో సేవకులుగా, విశ్వాసులుగా ఉన్నవారు వారి కుటుంబాలకొరకు, వారి బిడ్డల జీవితాలకొరకు, వారి ఎదుగుదలకొరకు మాత్రమే చూసుకొనుచున్నారు కానీ అనాధలైన వారిని దిక్కులేనివారిని పట్టించుకోవడం లేదు. కానీ దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అటువంటివారిని ఆదరించుటయే నిజమైన భక్తి అని తెలియజేస్తుంది. అందుకే పండిత రమాబాయి ఇటువంటి వారి కొరకు ముక్తి మిషన్, శారదా సదన్ అను సంస్థలను ప్రారంభించి వాటి దిక్కుమాలిన స్థితిలో వున్న వారికి తల్లిగా క్రీస్తు ప్రేమను చుపించింది. కాబట్టి క్రైస్తవులుగా వున్న మనం ఇతరులపట్ల ప్రేమకలిగి, సహాయము చేయాలి అనే మనసుకలిగి జీవించినట్లయితే మన జన్మకు ఒక సార్ధకత ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.!

818 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account